బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్ కి భూమిపూజ

 

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం తుళ్లూరు గ్రామంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలకృష్ణ దంపతులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ప్రముఖ వైద్యులు దత్తాత్రేయుడు నోరి, మంత్రులు నారా లోకేశ్‌, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఫరూక్‌, ఎంపీ కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాలను కేటాయించింది. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు ఏపీలోనూ సేవలందించాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని చేపడుతున్నారు.