భావన కిడ్నాప్ ప్లాన్ గీసింది ఇతనే

మళయాళ నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు సంచలనం సృష్టించింది. అయితే ఈ మిస్టరీని రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల్లో ఒకడైన మణికందన్ ఇచ్చిన వాంగ్మూలంలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. సునీల్‌కుమార్ అలియాస్ పల్సర్ సునినే ఈ కుట్రకు ప్లాన్ గీశాడని, అతని స్కెచ్ ప్రకారమే నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన జరిగిందని తెలిపాడు.

ఒక పని ఉందంటూ పల్సర్ సుని కాల్ చేసి తమను పిలిచాడని..ఎవరినో కొట్టేందుకు అతను పిలిచి ఉంటాడని నేను భావించాను..కానీ భావన మీద దాడి చేసేందుకు మమ్మల్ని పిలిచాడని తర్వాత తెలిసింది. భావనపై దాడి తర్వాత డబ్బు కోసం ఈ కుట్రలో భాగం పంచుకున్న ఇతర వ్యక్తులు డబ్బు కోసం సునితో గొడవ పడ్డారని, వారికి రూ.30 లక్షలు తర్వాత ఇస్తానని ఒప్పించి తర్వాత అడ్రస్ లేకుండా పోయాడని చెప్పాడు. కాగా పల్సర్ సుని ఇంకా పరారీలోనే ఉన్నాడు.