సీఐఎస్‌ఎఫ్ జవాను ఆత్మహత్య..

 

బెంగళూరులో  సీఐఎస్‌ఎఫ్ జవాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. బెంగళూరులోని కెంపె గౌడ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ జవాను తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడిన జవాన్‌ను సురేశ్ గైక్వాడ్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. జవాను ఆత్మహత్యపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.