కశ్మీర్‌లో పోలీసులపై ఉగ్రవాదుల దాడి..ఆయుధాల అపహరణ

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. బారాముల్లా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై దాడి చేసిన ఉగ్రవాదులు, వారి వద్ద నుంచి ఏకే-47 రైఫిల్‌ను అపహరించుకుపోయారు. ఉదయం తావీ బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరిగిందని, ఉగ్రవాదుల్లో ఒకరిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని, మరో ముష్కరుడు మాత్రం తప్పించుకున్నాడని ఉన్నతాధికారులు తెలిపారు. పారిపోయిన ఉగ్రవాదిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని..పట్టుబడిన మరో ఉగ్రవాదిని విచారిస్తున్నట్లు తెలిపారు.