బాపట్లలో దారుణం: విచారణకు డీజీపీ ఆదేశం

* కాలినడకన వస్తున్న కృష్ణా జిల్లా వాసిని వేధించిన బాపట్ల పోలీసులు
* సమగ్ర విచారణ చేయాల్సిందిగా గుంటూరు రేంజ్ ఐ జీ కి ఆదేశాలు

కృష్ణా జిల్లా, కైకలూరు కు చెందిన శ్రీనివాస్ తిరుపతి లో ఉద్యోగం చేస్తున్నాడు, లౌక్ డౌన్ కారణంగా తిరుపతి నుంచి కాలినడకన సోంత ఊరుకు వస్తున్న నెపధ్యంలో బాపట్ల పోలీసులు అరెస్టు చేసి, కోట్టడంతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ స్టేషన్లో చెట్టు కు ఉరి వేసుకుని చనిపోయాడు, చనిపోయే ముందు సెల్ఫీవిడియో వాట్సాప్ లో స్నెహితులకు పంపించటం విషయం వెలుగులోకి వచ్చింది.

బాపట్ల లో జరిగిన యువకుడి అత్మహత్య ఘటన పై సామాజిక మాధ్యమంలో వస్తున్న వార్తలపై స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. తక్షణమే సంఘటన  పై విచారణ కి ఆదేశించిన డీజీపీ. పూర్తి వివరాలతో  నివేదిక సమర్పించాలని గుంటూరు ఐ.జీ ని డి జీ పీ ఆదేశించారు.