కూతురు రేప్..తండ్రికి హార్ట్ ఎటాక్

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై ఆఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. చివరకు ప్రజల్ని రక్షించాల్సిన రక్షకభటుడే ఓ 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ వార్తను విన్న ఆ బాధితురాలి తండ్రి షాక్‌కు గురై గుండెపోటుతో మరణించాడు. బల్లియా జిల్లాలోని గోపాల్‌పూర్ పోలీస్ అవుట్ పోస్టు సమీపంలో ఓ బాలిక రాత్రి టాయిలెట్‌కని ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో అవుట్ పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ధరమ్ బాలికను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం జరిపాడు. ఆమె అరుపులు విన్న గ్రామస్థులు రక్షించారు. వారి రాకను పసిగట్టిన కానిస్టేబుల్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే బాలికపై రేప్ జరిగిన విషయాన్ని స్థానికులు ఆమె తండ్రికి చెప్పారు...ఊహించని ఈ వార్త విన్న ఆయన షాక్‌కు గురై గుండెపోటుతో మరణించారు. ఈ రెండు విషాదాలతో గ్రామంలో ఉద్వేగ వాతావరణం నెలకొంది. ఇంతటి దారుణానికి కారణమైన కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.