బాలయ్యతో మళ్ళీ జత కట్టనున్ననయనతార?

 

నందమూరి బాలకృష్ణ తన శ్రీమన్నారాయణ చిత్రం తరువాత మళ్ళీ ఇంతవరకు కొత్తగా ఏసినిమా కూడా మొదలుపెట్టలేదు. అయితే, త్వరలో ఆయన ఒక జానపద సినిమాలో నటించబోతున్నాడని టాలీవుడ్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ‘సింహా,’ ‘శ్రీ రామ రాజ్యం’ సినిమాలలో ఆయనతో జతకట్టిన నయనతార మళ్ళీ ఈ సినిమాలో కూడా ఆయనతో జత కట్టబోతోందని సమాచారం. ఈ సినిమాలో వారిద్దరూ మహారాజు, మహారాణీ పాత్రలు పోషిస్తారని సమాచారం. ఇక, బాలయ్య బాబు అభిమానులకు సంతోషం కలిగించే మరో ఆసక్తికరమయిన వార్త ఏమిటంటే ఈ సినిమాకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను ‘శ్రీరామరాజ్యం’ సినిమాను నిర్మించిన ఎలమంచిలి శివాజీ నిర్మిస్తారని సమాచారం. బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10వ తేదీన ఈ సినిమా షూటింగు మొదలవవచ్చునని సమాచారం. అయితే, ఈ విషయాన్నిఇంకా సంబందిత వ్యక్తులు ధృవీకరించవలసి ఉంది.