నేడు బాహుబలి డే..

ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న బాహుబలి ది కన్‌క్లూజన్ విడుదల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రి రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు రామోజీ ఫిల్మ్ సిటీలో కనీ వీని ఎరుగుని స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేదిక కోసం దాదాపు 500 మందికి పైగా నిపుణులైన కార్మికులు శ్రమిస్తున్నారు..మాహిష్మతి సామ్రాజ్యాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మిస్తున్నారు..ఎత్తైన భవంతులు, జలపాతాన్ని తీర్చిదిద్దారు. అతిథులు కూర్చొనేందుకు మామాలు కుర్చీలు కాకుండా..రాజరికాన్ని గుర్తు చేస్తూ సింహాసనాలు ఏర్పాటు చేశారు. దర్శకధీరుడు రాజమౌళి గత కొద్ది రోజులుగా ప్రీ రిలీజ్ వేడుక సెట్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, బాలీవుడ్‌లకు చెందిన అతిరథ మహారథులు హాజరవుతున్నారు.