తెలంగాణ భవన్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు ఇవాళ్టికి ఐదో రోజుకి చేరుకున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ కవిత, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి హాజరయ్యారు. తోటి మహిళలతో కలిసి బతుకమ్మలను పేర్చి పూజ అనంతరం ఆడిపాడారు.