ముగిసిన వాజ్‌పేయి అంత్యక్రియలు

 

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి.. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.. వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత, వాజ్‌పేయి చితికి నిప్పంటించారు.. హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు జరిగాయి.. అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, భూటాన్‌ రాజు వాంగ్‌చుక్‌, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్‌ నేతలు అడ్వాణీ సహా పలువురు స్మృతి స్థల్‌లో వాజ్‌పేయికు నివాళులర్పించారు.