దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై కేసిఆర్ సర్కార్ కు అసదుద్దీన్ షాక్..

తెలంగాణ లో టిఆర్ఎస్ ఎంఐఎం పార్టీల మధ్య ఉన్న బంధం అందరికి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆ రెండు పార్టీల మధ్య ఉన్న సీక్రెట్ అండర్ స్టాండింగ్ కూడా  తెలిసిందే. తాజాగా దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై తెలంగాణ తో సహా దేశం మొత్తం హర్షం వ్యక్తం ఔతున్న విషయం తెలిసిందే. ఐతే ఇదే విషయంలో టిఆర్ఎస్ సీక్రెట్ దోస్త్ ఐన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసి మాత్రం కెసిఆర్ కు షాక్ ఇచ్చారు. దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్ కౌంటర్ అనేది ప్రభుత్వ విధానం కాకూడదని ట్విట్ చేసారు. అలాగే ఈ మొత్తం వ్యవహారం పై మెజెస్టిరియల్ ఎంక్వయిరీ వేసి నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ ఘటన వెనుక ఉన్న వాస్తవాలను బయట పెట్టాలని అయన డిమాండ్ చేసారు. టిఆర్ఎస్ కు అలాగే కెసిఆర్ కు  మంచి మిత్రుడిగా ఉండే అసదుద్దీన్ ఇలా డిమాండ్ చేయడం తో అందరు షాక్ కు గురి అవుతున్నారు. ఐతే దిశ కేసు నిందితులలో ఒకరు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి  కావటమే ఈ ట్విస్ట్ కు కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు.