హోదా రాదు.. ప్యాకేజ్ మాత్రమే

విభజన హామీల అమలు.. ప్రత్యేకహోదా కోరుతూ ఏపీ ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రత్యేకహోదా అంశం మరోసారి రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన పరిస్థితుల్లో టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా రాదని.. కేవలం ప్రత్యేక ప్యాకేజ్ మాత్రమే వస్తుందని వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు.. తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ డ్రామాలు ఆడుతున్నారని.. వారు రాజీనామా చేసినా.. అవి ఆమోదం పొందేలోపే ఎన్నికల కోడ్ వస్తుందని అన్నారు. ఇదే అంశంపై ఏపీ హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. దమ్ముంటే జగన్ ఈరోజే తన ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.. సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.