బీజేపీ నుండి వైసీపీలోకి వలసలు...

 

నిన్న మొన్నటి వరకూ అధికార పార్టీ అయిన టీడీపీలోకి వైసీపీ నేతలు వరుస పెట్టి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. బీజేపీ నేతలు ఇప్పుడు వైసీపీ లోకి మారడానికి చూస్తున్నారు. ఇప్పటికే తనకు అధ్యక్ష పదవి రానందుకు అసంతృప్తితో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయించుకోగా.. ఇప్పుడు పలు నేతలు కూడా వైసీపీలోకి రావడానికి చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. కావూరి సాంబశివరావు. రేపు జగన్ సమక్షంలో బీజేపీలో చేరేందుకు కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయించుకోగా, ఆయన దారిలో కావూరి సాంబశివరావు, కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి కూడా పయనించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాటసాని ఈనెల 29న వైసీపీలో చేరుతారని తెలుస్తుండగా, కావూరి చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.