అక్టోబర్‌ 2 నుండి నిరుద్యోగభృతి

 

ఏపీ ప్రభుత్వం నిరోద్యుగులకు ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పేరుతో నెలకు వెయ్యి రూపాయలు చొప్పున నిరుద్యోగభృతి అందజేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే నిరోద్యుగులకు అందించే ఈ భృతిని అక్టోబర్‌ 2 నుండి పంపిణీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు ఉండవల్లిలో నిర్వహించిన తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగులకు అందించే నిరుద్యోగభృతిని అక్టోబర్‌ 2 నుంచి పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అక్టోబర్‌ 2 న ప్రారంభించనుంది.