మళ్ళీ కరెంట్ షాక్

రాష్ట్ర ప్రభుత్వం మరో ఇంధన సర్‌చార్జీ బాదుడుకు రంగం సిద్ధం చేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు గాను యూనిట్ విద్యుత్తుకు రూ.1.02 చొప్పున మొత్తం రూ.1137 కోట్ల ఎఫ్ఎస్ఏ వసూలుకు అనుమతి కోరుతూ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ముందు డిస్కంలు సోమవారం ప్రతిపాదనలు దాఖలు చేశాయి.