ఎపి సీఎస్‌తో సహా ఆరుగురు అధికారులకు హైకోర్టు నోటీసులు

ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానాలలో తరచుగా ఎదురు దెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీ హైకోర్టులో స్పషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటు పై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్బంగా ఏపీ సీఎస్, స్పెషల్ సీఎస్, డీజీపీ తో సహా ఆరుగురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఏపీలో మద్యపాన నియంత్రణ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం SEB (స్పషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో) ని ఏర్పాటు చేసింది. తాజాగా SEB కి చట్టబద్దత లేదని అందువల్ల SEB పెట్టె కేసులు న్యాయపరంగా చెల్లవని వాదిస్తూ ప్రకాశం జిల్లా వాసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ విచారణ లో భాగంగా హైకోర్టు ఆరుగురు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణ ను రెండు వరాల పాటు వాయిదా వేసింది.