జగన్ క్యాంపు ఆఫీస్ మెయింటనెన్స్ కి 1.94 కోట్లు.. ఉత్తర్వులు జారీ

 

జగన్ క్యాంపు కార్యాలయం రక్షణ నిర్వాహణ కొత్త సదుపాయాల కల్పన కోసం వివిధ పద్దుల కింద 1.94 కోట్ల కేటాయింపుకు పరిపాలన అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గుంటూరు జిల్లా తాడేపల్లి నివాసం వార్షిక నిర్వాహణకే 1.20 కోట్లు కేటాయించారు. ఇక్కడ జగన్ నివాసం క్యాంపు కార్యాలయంలో అల్యూమినియం కిటికీలు కొత్తగా ఏర్పాటు చేయటానికి గత నెలలో 73 లక్షలు విడుదల చేశారు. ఇప్పుడు ఫర్నీచర్ కోసం 39 లక్షలు కేటాయిస్తూ రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు. జగన్ తాడేపల్లిలో ఉన్న తన నివాసాన్ని క్యాంప్ ఆఫీస్ గా మార్చుకున్నారు. ఆ ఇంటి కిటికీలు తలుపుల కోసం 73 లక్షలు విడుదల చేస్తూ ఇంతకు ముందే జీవో విడుదలైంది. ఓ వైపు ఖర్చులు తగ్గించుకోవాలి అంటూనే సొంత ఇంటికి కోట్ల ఖర్చుపెట్టడం పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. గత ఐదు నెలల్లో జగన్ ఇంటి కోసం 16 కోట్లను ఎలా ఖర్చు చేశారంటూ టిడిపి ప్రశ్నించింది. మొత్తంగా చూస్తే జగన్ ఇంటి వద్ద హెలిప్యాడ్ నిర్మాణానికి 1.89 కోట్ల, బారికేడ్ లకు 75 లక్షలు, పోలీస్ బ్యారెక్ టాయిలెట్ బ్లాక్ కు 30 లక్షలు, సెక్యూరిటీ పోర్స్ గేట్స్ పోర్టబుల్ క్యాబిన్స్ ఏర్పాటుకూ 31 లక్షలు, గార్డ్ రూమ్ అండ్ టాయిలెట్ బ్లాక్ కు మరో 13.5 లక్షల నిధులు కేటాయించారు. కిటికీల రేటు బయటకు వచ్చినప్పుడే అవేమైనా బంగారుతో చేసారా అంటూ కౌంటర్లు వేశారు. ఇక మొత్తం మీద 16 కోట్లు ఖర్చు అయ్యిందంటే సీఎం గారిని ప్రభుత్వాన్ని విపక్షాలు.. నెటిజన్లు.. ఏమంటారో చూడాలి.