ఏపీలో కాంగ్రెస్ భారీ బ‌హిరంగ స‌భ‌.!!

 

ఏపీలో నాలుగేళ్లు మౌనంగా ఉన్న కాంగ్రెస్, సరైన సమయంలో బలపడే దిశగా అడుగులు వేస్తోంది.. మొదటగా పార్టీని వీడిన సీనియర్ నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని భావించిన కాంగ్రెస్.. ఆ దిశగా అడుగులు వేసింది.. మాజీ సీఎం కిరణ్ కుమార్ విషయంలో విజయం సాధించింది.. కిరణ్, తాజాగా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చారు.

 

 

కిరణ్ బాటలోనే మరికొందరు నాయకులను తిరిగి తీసుకురావాలని చూస్తున్న కాంగ్రెస్, దానికోసం పునాది వేయబోతుందట.. కాంగ్రెస్ త్వరలో ఏపీలో ఓ భారీ బహిరంగ సభ పెట్టి.. ఉన్న నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంతో పాటు.. కొత్తవారికి స్వాగతం పలకాలని చూస్తోందట.. ఎలాగూ కిరణ్ పార్టీలో చేరారు కాబట్టి, ఆయన సమక్షములో ఓ భారీ సభ పెడితే.. ఆయన చేరికను సంబరం చేసుకున్నట్టు ఉంటుంది.. అలానే కొత్త నాయకుల స్వాగతానికి బాటలు వేసినట్టు ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోందట.. చూద్దాం.. ఏపీలో పుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ ఏ మేరకు బలపడుతుందో.