మరో షాకిచ్చిన వైసీపీ.. ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణకు తీర్మానం
posted on Jan 22, 2020 1:55PM
రాజధాని ప్రాంతం అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారని ప్రతిపక్ష టీడీపీపై.. అధికార పార్టీ వైసీపీ పదేపదే ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మాటలు చెప్పడం కాదు.. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే రుజువు చేయాలనీ టీడీపీ నేతలు సవాలు సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలకపరిణామం చోటు చేసుకుంది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణకు అసెంబ్లీ తీర్మానం చేసింది. సభలో ఈ తీర్మానాన్ని హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలిపిన ఆమె... దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఇక, ఇన్సైడర్ ట్రేడింగ్పై చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో 4070 ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణ జరిపి, దీనికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.