విశాఖలో మరో అగ్ని ప్రమాదం

విశాఖపట్నంలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా విశాఖలో మరో పేలుడు ఘటన చోటు చేసుకుంది. అచ్యుతాపురం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు ఘటనతో కంపెనీలోని కార్మికులు భయంతో పరుగులు తీశారు. సమీపంలో ఉన్న ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి దగ్గరలోనే అగ్నిమాపక యంత్రం ఉండటంతో, వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.