ఏ పి లో కోవిడ్ వారియర్స్: గిరిజా శంకర్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ వారియర్ వాలంటీర్ల ను ఎంపికచేస్తున్నట్టు కోవిడ్ 19 స్పెషల్ ఆఫీసర్ గిరిజా శంకర్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చుననీ, ఇప్పటి వరకు కోవిడ్ వారియర్ గా పనిచేసేందుకు 2 వేల మంది దరఖాస్తు చేసుకున్నారనీ ఆయన చెప్పారు.
రాష్ట్రంలో ని 271 మెడికల్, డెంటల్, యునాని, ఆయుర్వేద, నర్సింగ్ కళాశాలలకు చెందిన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చునాని, కోవిడ్ వారియర్స్ గా సేవాలందించేవారికి భవిష్యత్తు లో ప్రభుత్వ నియామకాల్లో  ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు.