నంద్యాలలో గ్యాస్ లీక్.. ఒకరు మృతి, పలువురికి అస్వస్థత

కర్నూల్ జిల్లా నంద్యాల ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో ఒకరు మృతి చెందారు, పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 60మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్‌ లీక్ కావడంతో కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, వైద్య, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన వారిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.