కిషన్‌రెడ్డికి అమిత్ షా క్లాస్...

 

బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రస్తుతం తెలంగాణ ప్రర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే నల్లగొండ జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్న అమిత్ షా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైన కిషన్‌రెడ్డికి క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. కిషన్‌రెడ్డిని తన గెస్ట్‌హౌస్‌కు పిలుపించుకుని ఆయనను మందలించారట. పిలుస్తున్నా వేదికపైకి ఎందుకు రాలేదని, అలగాల్సిన అవసరం ఏముందని.. ఎవరికి వారు కాదు, పార్టీ కోసం పనిచేయాలని అమిత్‌ షా సూచించినట్టు సమాచారం. కాగా నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న అమిత్‌ షా వెలుగుపల్లి గ్రామంలో పండిట్ దీన్‌దయాళ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. దళితవాడకు దీన్‌దయాళ్ పేరు పెట్టారు. తర్వాత చిన్న మాదారంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు.