బుద్దా సవాల్...అంబటి హౌస్‌ అరెస్ట్‌...


సత్తెనపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో పెన్షన్ల జారీలో అక్రమాలు జరిగాయని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై ఆరోపణలు గుప్పించారు. అంబటి చేసిన ఆరోపణలపై స్పందించిన స్పందించిన బుద్దా వెంకన్న... తనపై చేసిన ఆరోపణలు తప్పని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాలు విసిరారు. దీంతో బుద్దా వెంకన్న చేసిన సవాల్ ను స్వీకరించిన అంబటి...  చర్చకోసం బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీనికి ఎలాంటి అనుమతి లేదని.. పోలీసులు అంబటిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా గుంటూరులో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. దీనికిగాను అంబటి... చర్చకు వెళ్లనీయకుండా టీడీపీ ప్రభుత్వమే అడ్డుకుంది.. అసలు పోలీసులను పురమాయించి అరెస్టులు చేయించేవాళ్లు అసలు సవాలెందుకు చేసినట్లు? ఇప్పటికైనా దమ్ముంటే చర్చకు రావాలి. పెన్షన్ల విషయంలో ప్రభుత్వ బండారం మొత్తం బయటపెడతా’’ అని రాంబాబు అన్నారు. మరోవైపు సవాల్ విసిరిన బుద్దా వెంకన్న.... భయమన్నది నా బ్లడ్ లో లేదు... అన్నింటికి నేను సిద్దం... వైసీపీ పార్టీ అబద్దాల పార్టీ అని అన్నారు.