అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ...


దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రిపబ్లిక్ డే నేపథ్యంలో ఈ నెల మొత్తం చాలా జాగ్రత్తగా ఉండాలని.. అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్టులోకి వస్తున్న, బయటకు వెళ్తున్న వాహనాలను, వ్యక్తులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.