తెలంగాణలో గెలిచిన మొదటి అభ్యర్థి ఇతనే

 

మరి కొద్ది గంటల్లో తెలంగాణ ఫలితాల ఉత్కంఠకు పూర్తిగా తెరపడనుంది. ఇప్పటికే తెలంగాణలో మొదట గెలిచిన అభ్యర్థి ఎవరో తేలిపోయింది. చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం) గెలిచారు. దీంతో ఎంఐఎం మొదటి సీటుని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతానికైతే దాదాపు 89 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. కూటమి 16, బీజేపీ 4, ఎంఐఎం 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.