సింబల్ వార్ లో శశికళకు షాక్...

 

పాపం శశికళకు గ్యాప్ లేకుండా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష పడి షాక్ తగిలిందో.. ఆతరువాత ఎన్నో షాకులు తగిలాయి. ఇప్పుడు తాజాగా మరో షాక్ తగిలింది. అయితే ఈసారి ఎన్నికల గుర్తు విషయంలో శశికళకు షాక్ తగిలింది. సింబల్ వార్ లో శశికళకు ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. అన్నాడీఎంకే గుర్తుపై గత కొద్దిరోజులుగా వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రెండాకుల గుర్తును పళని-పన్నీర్‌ వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో శశికళ వర్గ నిరాశలో ఉండగా.. పళని-పన్నీర్ వర్గం మాత్రం ఆనందంలో ఉన్నారు.