డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పన్నీర్

తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విద్యాసాగర్ రావు ఆయనతో ప్రమాణం చేయించారు. అలాగే పాండ్యరాజన్‌ భాషాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు. జయ మరణం తర్వాత అన్నాడీఎంకే పళనిస్వామి వర్గంగా..పన్నీర్ సెల్వం వర్గంగా వీడిపోయాయి. సుధీర్ఘ కాలంగా సాగిన ఈ హైడ్రామాకు ఇద్దరు నేతలు తెరదించారు. జయ మృతిపై న్యాయవిచారణతో పాటు శశికళను పార్టీ నుంచి బహిష్కరించాలన్న సెల్వం డిమాండ్లకు సీఎం పళనిస్వామి ఆమోదం తెలపడంతో విలీన ప్రక్రియ జరిగింది. రెండు వర్గాలు ఒక్కటవ్వడంతో పన్నీర్ సెల్వంతో పాటు ఆయన వర్గంలోని ముగ్గురిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు పళనిస్వామి.