ఒక్కటైన పన్నీర్, పళని..శశికళ బ్యాచ్ ఇక అవుట్
posted on Aug 21, 2017 3:37PM
తమిళనాడు రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఇవాళ్టీతో తెరపడింది. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఒక్కటయ్యాయి. విలీన ప్రక్రియను ఓ కొలిక్కి తెచ్చేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సీఎం పళనిస్వామితో భేటీ అయ్యారు పన్నీర్ సెల్వం. శశికళను ఆమె అనుచరులను పార్టీ నుంచి తప్పించేందుకు పళనిస్వామి అంగీకరించడంతో విలీనం జరిగింది. పన్నీర్ సెల్వంకు డిప్యూటీ సీఎంతో పాటు పార్టీ అధ్యక్ష హోదా దక్కనుంది. అలాగే పన్నీర్ వర్గంలోని ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. అనంతరం ఇద్దరు నేతలు విలీన ప్రకటన చేశారు. ఈ సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది.