చంద్రబాబుపై మోడీ కక్ష సాధింపు.. 19 లక్షల ఆంధ్రులకి దెబ్బ..

 

మరోసారి ఏపీ ప్రజలను ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ను ప్రధాని మోడీ దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నట్టున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏపీ ప్రత్యేక హోదా పోరాటం నేపథ్యంలో బీజేపీతో ఇప్పటికే చంద్రబాబు తెగదెంపులు చేసుకొని ఇప్పటికే శత్రువు అయ్యారు. ఇక మోడీకి వ్యతిరేకంగా ఏకంగా అవిశ్వాస తీర్మానం పెట్టేసి శాశ్వత శత్రువు అయ్యారు. ఇంత పోరాటం జరుగుతున్నా ఏపీ ప్రత్యేక హోదా విషయంలో మాత్రం మోడీ మౌన మునిలా కూర్చొని చూసేరా తప్పా.. కనీసం ఏపీకి న్యాయం చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు లేనట్టే కనిపించింది.

 

ఇక ఇప్పుడు పార్లమెంట్లో ఇంత ఆందోళనలు చేయడానికి కారణమైన చంద్రబాబుపై మోడీ పగపట్టిట్టున్నారు. అందుకే మరోసారి ఆయన చంద్రబాబుపై కత్తి కట్టునట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అది అగ్రిగోల్డ్ స్కాం విషయంలో. అగ్రిగోల్డ్ స్కాం.. కాంగ్రెస్ హయాంలో జరిగిన మరో భారీ స్కాం ఇది. దేశ వ్యాప్తంగా 32 లక్షల మంది అగ్రి గోల్డ్ బాధితులుంటే వీరిలో 19 లక్షల మంది ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు. ఇక కాంగ్రెస్ హయాంలో జరిగిన ఈ స్కాంను... చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆంధ్రులకు  ఎలా అయినా న్యాయం చెయ్యాలని, అగ్రి గోల్డ్ ఆస్తులను అమ్మి, నష్టపోయిన వారికి డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు.  ప్రభుత్వం తరుపున చేస్తే లేని పోనీ తలనొప్పులు అని, కోర్ట్ ద్వారా ఈ ప్రక్రియ చెయ్యటానికి రెడీ అయ్యారు.  దీనిలో భాగంగానే..  అగ్రి గోల్డ్ ను టేకోవర్ చేసేందుకు జీఎస్సెల్ గ్రూపు ముందుకొచ్చింది.

 

కోర్టుకు కూడా  జీఎస్సెల్ గ్రూపు ఇదే విషయం చెప్పింది. ప్రభుత్వం కూడా అగ్రిగోల్డ్‌ సంస్థలో డబ్బులు దాచుకున్న వారి జాబితా మొత్తం సిద్ధం చెయ్యమని సీఐడీ అధికారులని ఆదేశించింది... జీఎస్సెల్ గ్రూపు టేక్ ఓవర్ చేసిన అనంతరం సమకూరే నిధులు నుంచి బాధితులకు చెల్లించాల్సిన మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చెయ్యటానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇక అంతా బాగానే సాగిపోతుంది అనుకుంటున్న టైంలో, అగ్రిగోల్డ్‌ సంస్థను టేకోవర్‌ చేయడానికి ముందుకొచ్చిన ఎస్సెల్‌-జీ గ్రూపు చేతులేత్తేసింది... ఇదే విషయం నిన్న కోర్ట్ కి చెప్పింది.. అంతేకాదు, సమాజ్ వాది పార్టీ నేత అమర్ సింగ్‌ను కూడా తెరపైకి తీసుకు వచ్చింది, జీ గ్రూప్.. సంయుక్త ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వానికి ఆసక్తి ఉందని అమర్ సింగ్ చెప్పారని జీఎస్ఎల్ గ్రూప్ తెలిపింది.. ఇక  దీనిపై స్పందించిన కోర్టు... మీరు అగ్రిగోల్డ్‌ను స్వాధీనం చేసుకుంటారా లేదా రెండు వారాల్లో చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.

 

అయితే, ఈ తతంగం మొత్తం వెనుక మోడీ, బీజేపీ పెద్దల ఒత్తిడి ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి... ఇంత పెద్ద గ్రూప్, ఏమి గ్రౌండ్ వర్క్ చేసుకోకుండానే, ఇక్కడ వరకు వచ్చిందా ? ఇప్పుడు వచ్చి, మా వాల్ల కాదు అంటున్నారు అంటే, ఒత్తిడి ఉండే ఉంటుంది అని భావిస్తున్నారు... ఇది కనుక ఒక కొలిక్కి వస్తే, 19 లక్షల మందికి చంద్రబాబు దేవుడు అవుతాడు... అలా చేస్తే, రాజకీయంగా చంద్రబాబుకి లాభం... అందుకే, ఇది ముందుకు వెళ్ళకుండా ఆపారు అంటున్నారు... జీ ఛానెళ్ల నెట్ వర్క్ అధినేత సుభాష్ చంద్ర, 2016లో బీజేపీ సపోర్ట్ తో రాజ్యసభకు ఎన్నికయ్యారు.. మోడీ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారు. మొత్తానికి మోడీ ఏపీపై తనకు ఉన్న చిన్నచూపును మరోసారి చూపించారని... ఆంధ్రుల మీద కక్ష ఇలా తీర్చుకుంటున్నారని మండిపడుతున్నారు.