భావన కేసు: కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు

మళయాళ సినీ నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సుని ఇవాళ తన అనుచరుడు విజేశ్‌తో కొచ్చి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌‌ ఎదుట లొంగిపోయాడు. ఆ వెంటనే కోర్టు బయట ఉన్న పోలీసులు న్యాయమూర్తి చాంబర్‌లోకి వచ్చి నిందితులను తమ అదుపులోకి తీసుకున్నారు..అనంతరం వారిని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. అయితే లొంగిపోవడానికి వచ్చిన నిందితులను బయటకు లాక్కెళ్లి, అరెస్ట్ చేయడంపై సునీల్ తరపు న్యాయవాదులు మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. కాగా, ముందస్తు బెయిల్‌ కోసం నిందితులు పెట్టుకున్న పిటిషన్‌పై విచారణను కేరళ హైకోర్టు మార్చి 3కు వాయిదా వేసింది.