ఎమ్మెల్యేగా పదేళ్లు.. ఇప్పటికీ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం.!!

 

రాజకీయం సేవ చేయడానికి కాదు, సంపాదించుకోవడానికి అనుకునే అంతలా మారిపోయిన ఈ రోజుల్లో.. పదేళ్లు ఎమ్మెల్యేగా పని చేసి కూడా ఏసీ కార్లలో తిరగకుండా ఆర్టీసీ బస్సులో తిరిగే నాయకులు ఉంటారంటే నమ్ముతారా?.. అసాధ్యం అంటారా?.. ఉంటారు అలాంటి ఎమ్మెల్యేలు కూడా ఉంటారు.. కానీ నూటికో కోటికో ఒకరుంటారు.. అలాంటి వారిలో ఒకరే డాక్టర్  వీరపనేని యల్లమందరావు.. గుంటూరు జిల్లాలో కీలక స్థానమైన వినుకొండ నుండి కాంగ్రెస్ తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అయన ఇప్పటికీ సాధారణ వ్యక్తిలా హంగు ఆర్భాటం లేకుండా ఏక్కడకి  వెళ్ళినా ఆర్టీసీ బస్ ప్రయణం చేయడం విశేషం.. ఎమ్మెల్యేగా పనీ చేసే రోజుల్లో కూడా శాసనసభ సమావేశాలకి ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్రైను లో సామాన్యుడిలా ప్రయాణం చేసేవారు..  ప్రయాణంలోనే ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకొని వాటిని తీర్చేవారు.. నేటి రాజకీయనాయకులు ఇలాంటి వారిని చూసి చాలా నేర్చుకోవాలి.