బాలికపై ఎనిమిది మంది ఉపాధ్యాయుల గ్యాంగ్ రేప్

రాజస్థాన్‌లో దారుణం జరిగింది. బికనీర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై ఎనిమిది మంది ఉపాధ్యాయులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడాదిన్నర నుంచి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడుతూ..ఆ దారుణాన్ని వీడియోగా చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డారు..ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు. బాలికకు బ్లడ్ క్యాన్సర్ సోకడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నాపై ఏడు నుంచి ఎనిమిది మంది ఉపాధ్యాయులు అత్యాచారం చేశారు.

 

వారిలో కొందరి పేర్లు కూడా నాకు తెలియవు. వారు వస్త్రాలు లేకుండా నా ఫోటోలు, వీడియోలు తీసి బెదిరించారు. కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని మా అమ్మానాన్నకు చెప్పాను..చివరికి వాళ్లను కూడా ఆ ఎనిమిది మంది బెదిరించారు అని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కేసును దగ్గరుండి పర్యవేక్షిస్తామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం చెప్పారు. మరోవైపు బాధితురాలి వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని ఆ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్ హామీ ఇచ్చారు.