ప్రత్యేక హోదా కోసం మరో ప్రాణం బలైంది

 

చదువుకుంటూ, తోటి పిల్లలతో సరదాగా ఆడుకుంటూ సాగిపోవాల్సిన ఆ పసి జీవితం అర్దాంతరంగా ముగిసిపోయింది.. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ పదో తరగతి చదువుతున్న బాలుడు ప్రాణత్యాగం చేసాడు.. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గానికి చెందిన మహేంద్ర అనే బాలుడు ప్రత్యేక హోదా రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.. మహేంద్ర రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.. దానిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చివుంటే అన్నకు ఉద్యోగం వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశాడు.. మహేంద్ర ఆత్మహత్యపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.. అసెంబ్లీలో సంతాపం తెలిపారు.. ఇప్పటి వరకు ప్రత్యేకహోదా కోసం ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పిన చంద్రబాబు.. ప్రాణం చాలా విలువైనది.. ఎవరూ బలిదానాలు చేసుకోవద్దు.. పోరాడి సాధించుకుందామని అన్నారు.