10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్

 

 Hyderabad common capital, Hyderabad common capital for 10 years

 

 

హైదరాబాద్ ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచుతూ కాంగ్రెస్ సీడబ్ల్యూసీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ పదేళ్లలో ఆంధ్ర ప్రాంతానికి కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని, సీమాంధ్ర అభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్రం సమకూరుస్తుందని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఆంధ్ర ప్రాంతంలో రాజధాని ఏర్పడేవరకూ పరిపాలనా కార్యక్రమాలన్నీ హైదరాబాద్‌నుంచే నడుస్తాయని, హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలలోనూ ప్రజలు దేని గురించీ భయపడవలసిన అవసరం లేదని, అన్నిరకాల భద్రతా చర్యలనూ కేంద్రం తీసుకుంటుందని సీడబ్ల్యూసీ నిర్ణయంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు.