కొడుకు కోసం....పార్టీ జంప్..

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా పనిచేసిన ఎన్డీ తివారీ బీజేపీలోకి జంప్ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ సమక్షంలో ఆయన ఈరోజు బీజేపీలో చేరారు. అమిత్ షా ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా తన కొడుకు కోసమే ఎన్డీ తివారీ పార్టీ మారినట్టు తెలుస్తోంది. నిజానికి ఆయన తన కుమారుడు రోహిత్ తివారీకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ టికెట్ వస్తుందని ఆశించారు. కానీ అక్కడ ఆయనకు టికెట్ రాలేదు. దాంతో ఆయన బీజేపీ వైపు దృష్టిపెట్టారు. ఉత్తరప్రదేశ్ కాకపోయినా, ఉత్తరాఖండ్‌లో అయినా తన కొడుక్కి ఓ టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఈనేపథ్యంలోనే పార్టీ మారారు.