‘గ్రేటర్’ లో పాగా కు జగన్ ప్రయత్నాలు ?

 

 

 

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ నగరంలో బలం పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ముందుగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో సాధ్యమైనంత ఎక్కువ మంది కార్పొరేటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో ఆ పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

దాదాపు 20 మంది కార్పోరేటర్లు జగన్ గూటిలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. కార్పొరేషన్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కాలేరు వెంకటేష్ తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, నిన్న జైలులో జగన్ మోహన్ రెడ్డి ని కలిసారు. వచ్చే ఎన్నికల్లో ఆయన జగన్ పార్టీ నుండి అంబర్ పేట్ శాసనసభ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

 

ప్రస్తుతం ‘గ్రేటర్’ లో జగన్ పార్టీకి ఐదుగురు అసోసియేట్ సభ్యులు ఉన్నారు. నలుగు కాంగ్రెస్ కార్పోరేటర్లు, ఒక తెలుగు దేశం కార్పోరేటర్ జగన్ పార్టీలో చేరారు. మరో 20 మంది కార్పొరేటర్లను జగన్ పార్టీలోకి తెచ్చేందుకు వెంకటేష్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

నగరంలో ఎదిగే కార్యక్రమంలో మొదటి దశగా కార్పొరేటర్లను తన వైపుకు తిప్పుకోవాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.