రాజస్థాన్ రాయల్స్ కు 100 కోట్ల జరిమానా

 

 

ipl rajastan royals,  rajastan royals ed, ed 100 rajastan royals

 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝులిపించింది. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ 100 కోట్ల రూపాయల జరిమానా విధి౦చింది. ఈ మేరకు రాజసాన్ రాయల్స్‌ యాజమాన్యనికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు విదేశాల నుండి అక్రమంగా నిధులు సేకరించినట్లు ఈడీ పేర్కొంది. ఇది ఫెమా ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది. ఫెమా ఉల్లంఘన కింద ఈ మేరకు జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. జరిమానాగా విధించిన రూ.100 కోట్లను 45 రోజుల్లో చెల్లించాలని రాజస్థాన్ రాయల్స్ జట్టును ఆదేశించింది.