ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మాతృవియోగం..

 


పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మాతృవియోగం కలిగింది. దయాకర్‌రావు తల్లి ఆదిలక్ష్మి గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ నేపథ్యంలో ఆమె చాలా రోజులుగా సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈరోజు కన్నుమూసింది. ఆదిలక్ష్మి మృతితో దయాకర్‌రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదిలక్ష్మి మృతి పట్ల పలువురు నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.