ట్రంప్ పై పరువునష్టం కేసు..

 

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పై గతంలో చాలా మంది మహిళలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ మాతో అసభ్యకరంగా మాట్లాడాడని.. ట్రంప్ అసభ్యకరంగా ప్రవర్తించాడని పలువురు విమర్శలు గుప్పించారు. అయితే ఈవియషంపై ఇప్పటి వరకూ కోర్టు వరకూ వెళ్లిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఓ మహిళ ట్రంప్ పై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివరాల ప్రకారం..సమ్మర్‌ జెర్వోస్‌ అనే మహిళ  ట్రంప్‌పై పరువునష్టం దావాను దాఖలు చేసింది. 2007లో ఉద్యోగ అవకాశాల కోసం బేవర్లీ హిల్స్‌లోని హోటల్‌కు వెళితే ట్రంప్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. దీనిపై జాతికి అబద్దాలు చెప్పాడని.. అతని మాటలను వాపస్‌ తీసుకోవాలని కోరినా ఇంతవరకు స్పందన లేదని.. దీంతో తన గౌరవాన్ని కాపాడుకోవటానికి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని పేర్కొంది. కాగా ఈ నెల 20 వ తేదిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న సంగతి తెలిసిందే.