కాంగ్రెస్ కి ఒక్కటి దక్కలేదు
posted on Jun 5, 2013 6:52PM
దేశంలో తాజాగా జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సిట్టింగ్ సీట్లనూ కాంగ్రెస్ కోల్పోయింది. గుజరాత్లోని 2 లోక్సభ, 4 శాసనసభ స్థానాలలో బీజేపీ విజయభేరి మోగించింది. గుజరాత్లో బనస్కాంత, పోర్బందర్ ఎంపీ స్థానాలను కాంగ్రెస్ కోల్పోయింది. టోల్గేట్ వద్ద తుపాకీతో సంచలనం సృష్టించిన విఠల్ కాంగ్రెస్కు రాజీనామా చేసి, బీజేపీ తరఫున పోటీచేసి గెలిచారు. బీహార్లో మహరాజ్గంజ్ లోక్సభ స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి ప్రభునాథ్ సింగ్ గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ ఎత్తుగడ ఫలించలేదు. మహరాజ్ గంజ్ ఆర్జేడీ ఎంపీ ఉమేష్ కుమార్ సింగ్ మరణంతో ఎన్నిక నిర్వహించవలసి వచ్చింది. ఉమేష్ కుమారుడు జితేంద్ర స్వామికి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. అయినా ఫలితందక్కలేదు. బెంగాల్లోని హౌరా స్థానాన్ని తృణమూల్ కాంగ్రెస్ నిలబెట్టుకుంది. సీపీఎం అభ్యర్థిపై భారీ మెజార్టీతో ఇక్కడ తృణమూల్ అభ్యర్థి గెలుపొందారు.