పురంధేశ్వరి వెనుక ఉన్న శకుని ఎవరు ?

 

Purandeswari chandrababu, chandrababu NTR, NTR TDP, chandrababu  Purandeswari

 

కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో చంద్రబాబును విమర్శిస్తూ లేఖ రాయడం వెనుక ఓ మాజీ ఎంపీ ఉన్నాడని సమాచారం. ఈ మేరకు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ శకుని మాటలు విని మోసపోవద్దని పురంధేశ్వరికి సలహా ఇచ్చారు. అసలు ఆ శకుని ఎవరని టీడీపీలో అంతా ఆరాతీస్తున్నారు. దగ్గుబాటి కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్న ఓ మాజీ ఎంపీ ఈ లేఖ రాసేందుకు కారణంగా తెలుస్తోంది. గతంలో ఈయన టీడీపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పట్లో చంద్రబాబు ఇష్టం లేకపోయినా ఆయనకు పదవి ఇచ్చారని సమాచారం.


ఆయన ఎంపీ అయ్యాక దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు, హరికృష్ణ లకు సన్నిహితంగా మారినట్లు తెలుస్తోంది. కొంతకాలం తరువాత చంద్రబాబుకు వ్యతిరేకంగా మారి హరికృష్ణ తరపున కూడా ఈయనే సలహాదారుగా మారి లేఖలు రాసేవాడని తెలుస్తోంది. తాజాగా పురంధేశ్వరి తరపున ఇలాగే లేఖ రాయించి నందమూరి కుటుంబంలో తాజా చిచ్చు పెట్టాడని తెలుస్తోంది. ఈ లేఖ కారణంగా బాలకృష్ణ ఒకవైపు ఉంటే మిగిలిన నందమూరి వారసులు అంతా దాదాపు పురంధేశ్వరికే మద్దతుగా మాట్లాడుతున్నారు. హరికృష్ణ, జయకృష్ణలు బహిరంగంగానే ఈ విషయం తేల్చిచెప్పగా మిగిలిన వారు మౌనంగా ఉన్నారు.