`ఆదిపురుష్`లో సునీల్ శెట్టి?
on Feb 22, 2021
`ఆదిపురుష్` పేరుతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. `తానాజీ` ఫేమ్ ఓమ్ రౌత్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో లంకేశ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ దర్శనమివ్వనున్నారు. త్వరలోనే ఈ భారీ బడ్జెట్ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉంటే.. `ఆదిపురుష్`లో ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిని ఎంపిక చేశారని టాక్. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, ప్రభాస్ ప్రస్తుతం `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్` చేస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలోనే మలి షెడ్యూల్ కి సిద్ధమవుతోంది. శ్రుతి హాసన్ నాయికగా దర్శనమివ్వనున్న ఈ యాక్షన్ సాగా.. 2022 సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇక ప్రభాస్ చాన్నాళ్ళ తరువాత నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ `రాధేశ్యామ్` జూలై 30న రిలీజ్ కానుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాకి `జిల్` ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.