నవంబర్ 15న ఇలా చేస్తే గ్రహబాధలన్నీ తొలగిపోతాయ్!

 

గ్రహానుకూలం లేకపోతే ఏదీ సాధించలేం. ఆయా గ్రహాధిపతుల ఇచ్ఛానుసారం మానవ మనుగడ ఉంటుంది. అందుకే.. ప్రతి ఒక్కరికీ నవగ్రహారాధన చాలా ముఖ్యం. కానీ.. స్తోమత లేనివాళ్లకు ఇది బహు కష్టం. వాళ్ల కోసం కూడా కొన్ని పద్దతులను పెద్దలు సూచించారు. ప్రదోషవేళ అంటే... సూర్యాస్తమయం జరిగే రెండు గంటలూ... శివునికి ఇష్టమైన ఘడియలు. జగదంబతో కలిసి శివుడు తాండవమాడే ఆ సమయంలో... శివారాధన చేస్తే నవగ్రహాలూ శాంతిస్తాయ్. విశేష ఫలితాలిస్తాయ్. ముఖ్యంగా త్రయోదశినాడు వచ్చే ప్రదోషకాలం విశేషమైందని చెప్పాలి. ఇక కార్తీక బహుళ త్రయోదశి అయితే.. దాదాపు శివరాత్రితో సమానం. ఆ రోజున ఉపవాసం ఉండి.. ప్రదోషవేళ శివాలయానికి వెళ్లి.. నేరుగా గుళ్లోకి వెళ్లకుండా నవగ్రహారాధన చేసి, పిదప కాళ్లు కడుక్కొని శివ దర్శనం చేయాలి. అలా చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్థాయి. కార్తీక బహుళ త్రయోదశి ఈ నెల 15నే . ఇంకెందుకు నవగ్రహారాధనకు సిద్ధం కండి. ఈ అంశంపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే.. ఈ వీడియో క్లిక్ చేయండి....

 

 


More Karthikamasa Vaibhavam